BREAKING: ఆదిలాబాద్ జిల్లాలో సంచలన ఘటన.. సుపారీ గ్యాంగ్‌తో భర్తను హత్య చేయించిన భార్య

by Shiva |
BREAKING: ఆదిలాబాద్ జిల్లాలో సంచలన ఘటన.. సుపారీ గ్యాంగ్‌తో భర్తను హత్య చేయించిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్ జైనాథ్ హత్య కేసులో ఊహించిన పరిణామం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కళ్లు బైర్లు కమ్మే నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రేమించిన వాడి కోసం సొంత భార్య విజయలక్ష్మి సుపారీ ఇచ్చి భర్తను దారణంగా హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఆమె ఫోన్‌లో సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడిన కాల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కొన్నాళ్ల నుంచి విజయలక్ష్మి మహేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడినట్లుగా విచారణలో వెల్లడైంది. వాళ్ల వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని తెలిసి భార్య సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. కాగా, ఈ నెల 12న ప్రభుత్వ పాఠశాలు పున: ప్రారంభం అయ్యాయి. దీంతో గజానంద్ జైనాథ్ ఎప్పటిలాగానే బుధవారం నార్నూర్ మండలంలోని తన స్వగ్రామం నాగులకోయ నుంచి జైనథ్ మండలంలోని మేడిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు హాజరయ్యేందుకు బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలోనే అతడు నార్నూర్ మండలంలోని అర్జుని, లోకారి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అతడిపై దాడి చేసి హతమార్చారు.

Advertisement

Next Story

Most Viewed