BREAKING: అత్యంత ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాల తయారీ.. పోలీసుల అదుపులో నిందితుడు

by Shiva Kumar |
BREAKING: అత్యంత ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాల తయారీ.. పోలీసుల అదుపులో నిందితుడు
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని ముక్తాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కొన్నాళ్ల నుంచి ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ పాలు తయారు చేసి పలు చోట్ల విక్రయిస్తూ.. జనాన్ని బురడీ కొట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టిన రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం ఉదయం ప్రశాంత్ కల్తీ పాలు తయారు చేస్తుండగా ఆకస్మికంగా దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతడి నుంచి 60 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం, ధోల్పూర్ స్మిక్డ్ మిల్క్ పౌడర్ 8 ప్యాకెట్లను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed