BREAKING: వైజాగ్‌లో దారుణం.. విష ప్రయోగంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

by Disha Web Desk 1 |
BREAKING: వైజాగ్‌లో దారుణం.. విష ప్రయోగంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నర్సీపట్నంలో ఇవాళ దారుణం చోటచేసుకుంది. విష ప్రయోగంతో రత్న మాధురి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గత కొన్ని నెలలుగా శేఖర్ అనే వ్యక్తితో ఇప్పటికే ప్రేమలో ఉన్న ఆమె ఈ నెల 27న అతడిని కలిసింది. అయితే, అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతతో ఉన్న రత్న మాధురిని శేఖర్ ఆమె ఇంటి వద్ద వదివెళ్లాడు. ఇవాళ తెల్లవారుజామున విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రత్న మాధురి తుది‌ శ్వాస విడిచింది. ఈ క్రమంలో ప్రియుడు శేఖరే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ మృతురాలు రత్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అతడిపై రెండు రోజు క్రితమే నర్సీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ వెల్లడించారు

Next Story

Most Viewed