- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దారుణం.. వంట రుచిగా లేదని భార్యను చంపిన భర్త
దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి పీస్ పరిధిలో దారుణం జరిగింది. భార్య చేసిన వంట రుచిగా లేదని తాళి కట్టిన భార్యను హతమార్చాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ బాలాఘాట్ కు చెందిన రవీన దుర్వే (28), నవీన్ దుర్వే భార్యభర్తలు.11 సంవత్సరాల క్రితం పెళ్లయిన వీరికి ముగ్గురు పిల్లలు. అనురాధ దుర్వే 5 వ తరగతి, అన్షు దుర్వే 5 సంవత్సరాలు వీరిద్దరూ ఉత్తర్ ప్రదేశ్ లో బంధువుల దగ్గర ఉంటున్నారు. అరుణవ్ దుర్వే సంవత్సరం బాబును తమతో కలిసి బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ప్రగతి నగర్ లోని ప్రగతి కన్స్ట్రక్షన్ లో లేబర్ గా పనిచేస్తున్నారు.కన్స్ట్రక్షన్ సమీపంలో నివసిస్తున్న రవీనా దుర్వే, నవీన్ దుర్వే లకు సోమవారం రాత్రి వంట విషయంలో లొల్లి జరిగింది.
భార్య రుచిగా వంట చేయలేదనే కారణంతో భార్యతో నవీన్ దుర్వే గొడవపడి భార్యను ఇటుక రాయి తో తలపై బలంగా కొట్టాడు.దీంతో భార్య రవీన దుర్వే తీవ్ర గాయాలకు గురై చనిపోయింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు రవీనా డెడ్ బాడీ ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు నవీన్ దుర్వే ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.