- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రేమించిన యువతి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్యాయత్నం
దిశ, కొల్చారం: ప్రేమించిన యువతి తనతో కాకుండా మరో యువకునితో తిరుగుతుందని మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొల్చారం మండలం అప్పాజీ పల్లి గ్రామానికి చెందిన సదాల షేకులు, పోచమ్మల రెండవ కుమారుడు సదాల ప్రవీణ్ (26) మెదక్ పట్టణానికి చెందిన తమ బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఇరు కుటుంబాల వారు పెళ్లికి ఒప్పుకున్నారు కానీ, తాను ప్రేమించిన అమ్మాయి గత కొన్ని రోజులుగా మరో అబ్బాయితో తిరుగుతుండడం ప్రవీణ్ గమనించాడు. ఈ విషయాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలుపగా వారు అమ్మాయిని ప్రవీణ్ ని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు గురి చేశారు.
ప్రేమించి మోసం చేశాడని మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అమ్మాయి తరఫు బంధువులు పోలీస్ స్టేషన్ లో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో మనస్థాపం చెందిన ప్రవీణ్ ప్రవీణ్ సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా వెంటనే కుటుంబ సభ్యులు కొంపల్లి శివారులోని వెల్నెస్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ ను వివరాలు అడగగా తమకు ఇంకా ఫిర్యాదు రాలేదని తెలిపారు.