695 సీనియర్​ వైద్యులకు పోస్టింగ్​లు

by  |
695 సీనియర్​ వైద్యులకు పోస్టింగ్​లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 695 మంది సీనియర్ రెసిడెంట్లకు వైద్యశాఖ పోస్టింగ్ లు ఇచ్చింది. వేర్వేరు దవాఖాన్లలో పనిచేసేందుకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ​డా.రమేశ్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్​ నిబంధనల ప్రకారం వైద్య విభాగంలో పీజీ పూర్తయిన తర్వాత, ఏడాది పాటు సీనియర్ రెసిడెంట్‌గా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది పీజీ పూర్తి చేసుకున్న డాక్టర్లకు అధికారులు కౌన్సిలింగ్​ నిర్వహించారు. మెరిట్ ప్రకారం తుది జాబితాను తయారు చేసి పోస్టింగ్స్‌ ఇచ్చారు. అయితే వీరిలోని కొందరిని కొత్తగా అందుబాటులోకి రాబోతున్న 8 మెడికల్ కాలేజీల్లోనూ భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ ఫస్ట్ నుంచే వీరంతా విధుల్లోకి చేరాలని వైద్యశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.



Next Story

Most Viewed