- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరోనా కారణంగా ఉపాధికి గండిపడి పూట గడవడానికి ఇబ్బంది పడే ప్రతి పేద కుటుంబానికి 2 నెలలకు సరిపడా రేషన్ను ఉచితంగా అందివ్వాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుతూ ధరలపై నియంత్రణ ఉంచాలని డిమాండ్ చేశారు. కూరగాయల రేట్లు 300 శాతం పెరిగినట్టు మీడియాలో చూస్తున్నామన్న ఆయన, బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
లాక్డౌన్ నేపథ్యంలో వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని చెప్పారు. విపత్తులు సంభవించినప్పుడు బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత అని ఆయన తెలిపారు. విదేశాల నుంచి 15 వేల మంది రాష్ట్రానికి వచ్చినట్టు తెలుస్తోందన్న ఆయన, వారందర్నీ క్వారంటైన్ చేయాలని సూచించారు. పకడ్బందీగా ఐసోలేషన్ వార్డులు నిర్వహించాలని ఆయన సూచించారు.
Tags: chandrababu naidu, ap, tdp, corona virus, covid-19