- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా కలకలం రేపింది. జయప్రకాష్ మున్సిపల్ పాఠశాలలో 26మంది విద్యార్థులకు మంగళవారం కరోనా పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురైయ్యారు. పాఠశాలలో 160మంది విద్యార్థులు చదవగా ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 26 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేపట్టారు.
పాజిటివ్ వచ్చిన విద్యార్థులందరూ నాలుగో తరగతి చదువుతున్నట్లు ప్రధానోపాధ్యాయరాలు బి.శారదా తెలిపారు. అలాగే దత్తిరాజేరు మండలం కేజీబీవీ స్కూల్లో ముగ్గురు విద్యార్థినిలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.