ఒకే క్లాస్ లో పది మంది పిల్లలకు కరోన.. ఎక్కడంటే ?

by  |
corona
X

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా బొబ్బిలిలో కరోనా కలకలం రేపింది. జయప్రకాష్ మున్సిపల్ పాఠశాలలో 26మంది విద్యార్థులకు మంగళవారం కరోనా పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురైయ్యారు. పాఠశాలలో 160మంది విద్యార్థులు చదవగా ఏడుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 26 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేపట్టారు.

పాజిటివ్ వచ్చిన విద్యార్థులందరూ నాలుగో తరగతి చదువుతున్నట్లు ప్రధానోపాధ్యాయరాలు బి.శారదా తెలిపారు. అలాగే దత్తిరాజేరు మండలం కేజీబీవీ స్కూల్‌లో ముగ్గురు విద్యార్థినిలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.


Next Story