- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
![ఘోర రోడ్డు ప్రమాదం.. రక్తపు మడుగులో వ్యక్తి మృతి ఘోర రోడ్డు ప్రమాదం.. రక్తపు మడుగులో వ్యక్తి మృతి](https://www.dishadaily.com/wp-content/uploads/2021/09/mncl-1.jpg)
X
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల ఫ్లై ఓవర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అతివేగంతో బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మంచిర్యాల పట్టణానికి చెందిన సిలబోయిన ఆథమ్(17) (బెల్లంపల్లి మిషన్ భగీరథ కాంట్రాక్టర్ కుమారుడు) పట్టణంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాడు.
ఈ నేపథ్యంలో పనుల పరిశీలన చేసేందుకు బైక్పై వస్తుండగా అతి వేగంగా వచ్చిన లారీ అతడి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ఘటన స్థలంలోనే ఆథమ్ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే తాళ్ల గురజాల ఎస్ఐ సమ్మయ్య ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించినట్టు తెలిపారు.
Next Story