- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్కు ఓట్లేస్తే మూసీలో వేసినట్లే : బండి సంజయ్
దిశ,భీమదేవరపల్లి: భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో సోమవారం రోజున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తో హుస్నాబాద్ నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పైసలతో మీ ఓట్లను కొనాలనుకుంటున్నారు.పొరపాటున పైసలు తీసుకుంటే, మీకు నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది అని అన్నారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుంటే పోరాడేది నేనే. 300 సీట్లకు మించి పోటీ చేయని కాంగ్రెస్ కు అధికారం ఎట్లా సాధ్యం? కాంగ్రెస్ కు ఓట్లేస్తే మూసీలో వేసినట్లే అని అన్నారు. కరీంనగర్ లో ముగ్గురు అభ్యర్ధులను బేరీజు వేయండి అని మీకు అండగా నిలిచేదెవరో ఆలోచించండి. మీరు తయారు చేసిన బిడ్డగా మీ ముందుకు వస్తున్న అని అన్నారు.
13న జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తుపై ఓటేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ బాక్సులను బద్దలు కొట్టండి అని అన్నారు. మాట్లాడిన క్రమంలో పార్టీ కార్యకర్తల తో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అందరితో పాటు ప్రతిజ్ఞ చేశారు. తదనంతరం ఎల్కతుర్తి మండలం నుంచి మాజీ సర్పంచ్లను ఎంపీటీసీలను ఇతర పార్టీల కార్యకర్తలతో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పైడిపల్లి పృథ్వీరాజ్, జిల్లా అధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, కిషన్, సదానందం, సాయి, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.