ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై పోలీసుల దాష్టికం.. పుస్తే, మెట్టెలు తీసేసి..

by Disha Web Desk 9 |
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై పోలీసుల దాష్టికం.. పుస్తే, మెట్టెలు తీసేసి..
X

దిశ, వెబ్‌డెస్క్: జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన అఖిల్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన కీర్తి ప్రేమించి ఏప్రిల్ 29న వివాహం చేసుకున్నారు. అమ్మాయి కీర్తి కుటుంబ సభ్యులు అఖిల్ ఇంటి మీదకి వెళ్లి గొడవ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని రక్షణ కల్పించాలని ప్రేమజంట పాలకుర్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే దంపతులు అఖిల్-కీర్తినే బెదిరించారు. కీర్తితో దుర్భాషలాడుతూ మెడలో కట్టిన తాళిని తెంపి, కాళ్ళకు పెట్టిన మెట్టెలను తీపించి ఇద్దరినీ కలవకూడదని బెదిరించారు. దీంతో జనగామ జిల్లా అంబేద్కర్ సాక్షిగా మాకు ప్రాణ భయం ఉందని, మాకు మా కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించాలని మీడియాకు వినతిపత్రం ఇచ్చారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed