కేటీఆర్‌పై చర్యలకు ఆదేశించిన ఎన్నికల సంఘం

by GSrikanth |
కేటీఆర్‌పై చర్యలకు ఆదేశించిన ఎన్నికల సంఘం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలకు సిద్ధమైంది. ఎన్నికల రోజున ఆయన మాట్లాడుతూ ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా వెల్లడించారు. దీనిని ఎన్నికల ఉల్లంఘనగా పేర్కొంటూ ఈసీ చర్యలకు ఆదేశించింది. కాగా, ఈ అంశంపై ఇప్పటికే ఎన్నికల సంఘం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని డెడ్‌లైన్ సైతం విధించింది. గడువు ముగిసినా వివరణ ఇవ్వకపోవడంతో చర్యలకు ఆదేశించింనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed