కొండా గెలుపు పక్కా.. : తోకల శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 11 |
కొండా గెలుపు పక్కా.. : తోకల శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, రాజేంద్రనగర్ : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించడం పక్కా అని రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన హైదర్ గూడ ఓల్డ్ విలేజీలో ఇంటింటికీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కొండా తోనే సాధ్యమన్నారు. ఆయనకు అడుగడుగునా అపూర్వ స్పందన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed