చేవెళ్ల ప్రజలకు నేను గ్యారెంటీ: ఎంపీ రంజిత్ రెడ్డి

by Disha Web Desk 19 |
చేవెళ్ల ప్రజలకు నేను గ్యారెంటీ: ఎంపీ రంజిత్ రెడ్డి
X

దిశ, శంషాబాద్: చేవెళ్ల ప్రజలకు నేను గ్యారెంటీ అని చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కోటేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తుప్పర గ్రామంలో శంషాబాద్ మండలం బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు రమేష్, మాజీ వార్డు సభ్యులు సురేష్ గౌడ్, రాములుతో పాటు 150 మొండి నాయకులు కార్యకర్తలు చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వమన్నారు 3 నెలలు కాకముందే ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు.

ఈ ఆరు గ్యారెంటీ పథకాల్లో కూడా మహిళలకే పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మహిళలకు 500కే గ్యాస్ కలెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించామని తెలిపారు. గతంలో ఎంపీగా గెలిచి ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డ విశ్వేశ్వర్ రెడ్డిని కలవాలంటే ప్రజలు అపాయిట్మెంట్ తీసుకోవాలని ఎద్దేవా చేశారు. తనను కలవాలంటే 24 గంటలపాటు ఇంటి తలుపులు తెరిసే ఉంటాయన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

********

Next Story

Most Viewed