- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జల్ పల్లి లో కారు దిగిన మరో కౌన్సిలర్
దిశ, బడంగ్ పేట్ : జల్ పల్లి మున్సిపాలిటీకి చెందిన మరో కౌన్సిలర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పటికే గత ఏప్రిల్ 5వ తేదీన జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన 8మంది కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధ్యక్షుడు, వైస్ చైర్మన్లు కారు దిగి కాంగ్రెస్లో చేరిన విషయం విధితమే. తాజాగా జల్ పల్లి మున్సిపాలిటీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్ కె. లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీని వీడి మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జి కేఎల్ ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన లక్ష్మీనారాయణకు కేఎల్ఆర్ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. మొదట బీజేపీలో ఉన్న లక్ష్మీనారాయణ 2006లో పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం సబిత వెంట లక్ష్మీనారాయణ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2020లో జల్ పల్లి మున్సిపాలిటీ 18వ వార్డు లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన లక్ష్మీనారాయణ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ను వీడి వార్డు అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.