మోడీని ఓడించేందుకు పాకిస్థాన్‌లో కుట్ర: రాజా సింగ్ సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 19 |
మోడీని ఓడించేందుకు పాకిస్థాన్‌లో కుట్ర: రాజా సింగ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించేందుకు భారత్‌తో పాటు దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ కుట్ర జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పాలకులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రజలు దేశంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బీజేపీకి ఓటేయాలన్నారు. హిందువుల ఏండ్ల నాటి రామ మందిర నిర్మాణ కలను సాకారం చేసిన మోడీకి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనదని ఎమ్మెల్యే రాజా సింగ్ అభివర్ణించారు. నిత్యం వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాజా సింగ్.. పాక్‌లో మోడీని ఓడించేందుకు కుట్ర జరుగుతోదంటూ ఎన్నికల వేళ చేసిన లేటేస్ట్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story

Most Viewed