సూక్ష్మ పరిశీలకుల ఎంపిక పూర్తి.. ఈ నెల 7న కూకట్ పల్లి జేఎన్టీయూలో శిక్షణ

by Disha Web Desk 23 |
సూక్ష్మ పరిశీలకుల ఎంపిక పూర్తి.. ఈ నెల 7న కూకట్ పల్లి జేఎన్టీయూలో శిక్షణ
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వలను ఆన్ లైన్ ద్వారా ఎంపిక చేశారు.మల్కాజిగిరి లోక్ సభ జనరల్ పరిశీలకులు డాక్టర్ ప్రియాంక శుక్లా, ఎన్నికల అధికారి గౌతమ్ సమక్షంలో రెండవ రాండమైజేషన్ ద్వారా మైక్రో అబ్జర్వర్ లను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన సూక్ష్మ పరిశీలకులకు నెల 7 వ తేదీన కూకట్ పల్లి లోని జేఎన్టీయూలో సాధారణ పరిశీలకులు డాక్టర్ ప్రియాంక శుక్లా ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, డీఈఓ విజయ కుమారి పాల్గొన్నారు.

Next Story