- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మూడోసారి ప్రధాని మోడీకి అవకాశం ఇవ్వాలి
దిశ, మెదక్ టౌన్ : ప్రధాని మోడీ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని, మరో సారి ప్రధానిగా మోడీకి అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజుల కోరారు. శుక్రవారం మెదక్ పట్టణంలో నల్ల పోచమ్మ ఆలయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు సతీమణి మంజుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయి నగర్, వెంకట్రావు నగర్ కాలనీ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నామని,
ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు. మోడీ పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధాన మంత్రి చేయడానికి మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాధవనేని రఘునందన్ రావుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, అసెంబ్లీ ఇంచార్జీ ఎక్కలదేవి మధు, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మొర్చ జిల్లా అధ్యక్షురాలు బెండే వీణ, నల్లాల విజయ్, సంగీత, ప్రవళిక, కల్కి నాగరాజు, శివ, సుంకోజు రాజు తదితరులు పాల్గొన్నారు.