హామీలను అమలు చేస్తాం

by Disha Web Desk 15 |
హామీలను అమలు చేస్తాం
X

దిశ, నర్సాపూర్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అంతకుముందు మల్లన్న గుడి నుండి అంబేద్కర్ క్రాస్ రోడ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు మాత్రమే అవుతుందని, అభివృద్ధి పనులు చేసేందుకు టైమ్ పడుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేసిందని, ఎన్నికల అనంతరం అర్హులైన వారందరికీ ఇండ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. నర్సాపూర్ నియోజక వర్గం

నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు 20వేల మెజార్టీ తీసుకురావాలన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుందని, బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంటుందని, బీజేపీ మూడో స్థానంలో ఉంటుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో డబ్బులు పంచి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని, నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందని ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎంపీ సురేష్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు చిలుముల సుహాసిని రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రాల మల్లేష్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, హబీబ్ ఖాన్,కుమ్మరి నాగేష్, లలిత, గొర్రెల అశోక్, రిజ్వాన్, రషీద్, అజ్మత్ తోపాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed