డీప్ ఫేక్ ఇష్యూ: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

by Disha Web Desk 9 |
డీప్ ఫేక్ ఇష్యూ: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఫేక్ వీడియోల వివాదంలో మరో కాంగ్రెస్ కీీలక నేతపై కేసు నమోదు అయింది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదు అయ్యింది. బండి సంజయ్ మీద డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మీద వెలిచాల రాజేందర్ రావుపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed