టీ-కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. ఏకంగా గాంధీ భవన్‌లోనే గొడవకు దిగిన నేతలు..!

by Disha Web Desk 19 |
టీ-కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. ఏకంగా గాంధీ భవన్‌లోనే గొడవకు దిగిన నేతలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ టీ-కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన హైదరాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేషన్ సమావేశంలో నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీరుల్లాఖాన్ ముందే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. కార్యకర్తలు తీవ్ర ఆవేశంతో ఒకరిమీదకు మరొకరు దూసుకెళ్లారు. పక్కనే ఉన్న నేతలు వెంటనే అప్రమత్తమై కార్యకర్తలను అదుపు చేయడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో గాంధీభవన్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్వయంగా కో-ఆర్డినేషన్ మీటింగ్‌లోనే కేడర్ గొడవకు దిగడంతో తీవ్ర అసహనానికి గురైన ఎంపీ అభ్యర్థి సమీరుల్లాఖాన్ మీటింగ్ మధ్యలో నుండి వెళ్లిపోయారు. పోలింగ్‌కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఓ పక్కా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం హోరెత్తిస్తుంటే.. మరోవైపు కేడర్ మాత్రం వర్గ విభేదాలతో ఏకంగా గాంధీ భవన్‌లోనే ఘర్షణకు దిగడం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed