- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ పార్టీతోనే సబ్బండ వర్గాల అభివృద్ధి : వెడ్మ బొజ్జు పటేల్
దిశ, కడెం :- కాంగ్రెస్ పార్టీతోనే సబ్బండ వర్గాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జొన్నల చంద్ర శేఖర్ గుప్తా బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి, ఖానాపూర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ సమక్షంలో వారి అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షులు ఒడ్నాల సత్తన్న, లచ్చన్న, ఉప సర్పంచ్ శ్రవణ్, బెడద మల్లయ్య, మేకల శేఖర్, గంగాధర్ కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్, బిజెపి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి సతీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ముస్కు రాజు, గోళ్ల వెంకటేష్, భూషణ్, రమేష్ రాజన్న, కొల శ్రీనివాస్, ఆకుల లచ్చన్న, సౌదని రాజన్న, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.