ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది : ఎమ్మెల్యే వెడ్మబొజ్జు

by Disha Web Desk 11 |
ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ  పనిచేస్తుంది : ఎమ్మెల్యే వెడ్మబొజ్జు
X

దిశ, ఖానాపూర్ : రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వ పనిచేస్తుంది అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోజున ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. ప్రతి పేదవాడికి అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయనను ప్రధానిని చేయడమే మన లక్ష్యం కావాలన్నారు.

రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 5న ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ప్రతి గ్రామ నుంచి బూతు సభ్యులు 50 మంది కంటే తక్కువ కాకుండా రాహూల్ గాంధీ సభకు తీసుకరావాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, కార్మికులు,కర్షకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో ఖానాపూర్ జడ్పీటీసీ చేరిక

ఖానాపూర్ పట్టంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోజు ఖానాపూర్ మండల జడ్పీటీసీ ఆకుల రాజమణి వెంక గౌడ్, మండలం లోని బాధనకుర్తి, సోమర్ పెట్ మాజీ ఎంపీటీసీ గుడాల రాజన్న, బండారి రవీందర్, తునికి రవి, జంగిలి చిన్న నర్సయ్య, అరపెళ్లి అంజగౌడ్, బండి వెంకటి, అలిశెట్టి బుచ్చన్న, చిలివేరి రమేష్, రామంజమ్ గౌడ్ పలువురు 400 బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దోనికేని దయనంద్, మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, వైస్ చైర్మన్ సంతోష్ ,షబ్బీర్ పాషా ,జంగిలి శంకర్, గుగ్లవత్ రాజేందర్, కరిపే రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed