- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అదిరిపోయే స్పోర్ట్స్ లుక్తో సరికొత్త ఈవీ బైక్.. ఒక్క చార్జింగ్తో 323 km
దిశ, బిజినెస్ బ్యూరో: ఇండియా మార్కెట్లోకి బుధవారం కొత్త మోడల్ ఎలక్ట్రిక్ బైక్ విడుదలైంది. అల్ట్రావయోలెట్ కంపెనీ ‘F77 మ్యాక్ 2’ అనే ఈవీ బైక్ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 2,99,000. దీనిలో టాప్ ఎండ్ F77 Mach 2 Recon ప్రత్యేక ప్రారంభ ధర రూ. 3,99,000. ఇవి తొమ్మిది కలర్స్లలో లభిస్తాయి. అవి స్టెల్లార్ వైట్, సూపర్సోనిక్ సిల్వర్, లైట్నింగ్ బ్లూ, ప్లాస్మా రెడ్, టర్బో రెడ్, ఆఫ్టర్బర్నర్ ఎల్లో, స్టెల్త్ గ్రే, ఆస్టరాయిడ్ గ్రే, కాస్మిక్ గ్రే. ప్రస్తుతం బుకింగ్లు మొదలయ్యాయి. కొండ ప్రాంతాలలో నివసించే కస్టమర్లకు ముఖ్యమైన హిల్-హోల్డ్ ఫీచర్ను కూడా దీనిలో అందించారు.
దీనిలో స్టాండర్డ్ వేరియంట్ 211km, టాప్ వేరియంట్ సింగిల్ చార్జింగ్తో దాదాపు 323 km ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఆసియాలో ఎలక్ట్రిక్ టూవీలర్లలో ఈ బైక్ మాత్రమే సింగిల్ చార్జింగ్తో అత్యధిక దూరం ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. ఇది కేవలం 2.8 సెకన్లలో 0 నుండి 60 కి మీ వేగాన్ని చేరుకుంటుంది, గరిష్టంగా 155 kmph వేగాన్ని అందుకుంటుంది. దీనిలో అత్యాధునిక ఫీచర్లను అందించారు. ఈ బైక్పై ఎవరైనా కూర్చోవడానికి లేదా కదిలించడానికి ప్రయత్నించిన ఓనర్ల స్మార్ట్ఫోన్కు హెచ్చరికను పంపిస్తుంది. అలాగే రైడర్లు తాము ప్రయాణించిన దూరం, ఇతర డేటాను చూడటానికి ఐదు అంగుళాల TFT డిజిటల్ క్లస్టర్, ఇంకా ఆటో-డిమ్మింగ్ లైట్లు, హిల్ హోల్డ్, ABS, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లను బైక్లో అందించారు.