- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెరిగిన వడ్డీని ఖాతాదారుల అకౌంట్లో జమ చేస్తున్న EPFO
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచిన విషయం తెలిసిందే. అయితే పెరిగిన వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయడం మొదలుపెట్టినట్లు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) బుధవారం తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేసిన ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లకు పెరిగిన వడ్డీని కేటాయించే పనిని ప్రారంభించినట్లు, అతి త్వరలో ఖాతాదారులు తమ అకౌంట్లలో పెరిగిన వడ్డీ తాలుకు అమౌంట్ను చూస్తారని పేర్కొంది.
ఇప్పటికే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 28.17 కోట్ల మంది సభ్యుల బ్యాంకుల ఖాతాలకు వడ్డీని జమ చేసినట్లు సంస్థ తెలిపింది. ఒకవేళ నిధులు పొందడంలో సమస్య ఉన్నట్లయితే http://epfigms.gov.inలో నమోదు చేయాలని X లో పేర్కొంది. ఈపీఎఫ్ఓ అకౌంట్లపై సాధారణంగా వడ్డీ రేటు 8.15 శాతం ఉండగా, దానిని గత ఏడాది 8.25 శాతానికి పెంచారు. గత వారం, ఫిబ్రవరి 2024లో నికర ప్రాతిపదికన 15.48 లక్షల మంది సభ్యులు చేరారని, వారిలో సుమారు 7.78 లక్షల మంది సభ్యులు మొదటిసారిగా నమోదు చేసుకున్నారని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ తెలిపింది.