ఏపీ అభివృద్ధికి ప్రధాని భరోసా.... చంద్రబాబు రియాక్షన్ ఇదే..!

by Disha Web Desk 16 |
ఏపీ అభివృద్ధికి ప్రధాని భరోసా.... చంద్రబాబు రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అభివృద్ధిపై ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటోందని చెప్పారు. , కానీ ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో పోతోందని ఎద్దేవా చేశారు. కూటమిది అభివృద్ధి మంత్రమని, వైసీపీది అవినీత మంత్రమని చంద్రబాబు విమర్శించారు. కూటమి ఎందుకు ఏర్పడిందో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూటమికి అన్ని మంచి శకునాలేనని చెప్పారు. వైసీపీకి అన్ని పీడ శకునాలేని సెటైర్లు వేవారు. ఈ ఎన్నికల్లో సైకో జగన్ పోవాలని, ప్రజలు గెలవాలని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం పవన్ ఏత్యాగానికైనా సిద్ధంగా ఉంటారని, సీట్ల కోసం ఆలోచించరని చెప్పారు. అలాంటి పవన్ కల్యాణ్‌ను విశాఖ వస్తే ఆటంకాలు కలించారని, బలవంతంగా తరలించారని మండిపడ్డారు. విశాఖ నగరం జగన్ సొత్తు కాదన్నారు. ఎన్టీయే గెలుపు ఖాయమని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రధాని సైతం చెప్పారన్నారు. అవినీతి సర్కర్ ఇంటికే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అధికారం చేతిలో ఉందని 59 నెలల పాటు జగన్ విర్రవీగారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed