టీ20 వరల్డ్ కప్ భారత జట్టు.. ఐపీఎల్‌లో ఏ జట్టునుంచి ఎంతమంది ప్లేయర్లకు చాన్స్ దక్కిందంటే..?

by Disha Web Desk 12 |
టీ20 వరల్డ్ కప్ భారత జట్టు.. ఐపీఎల్‌లో ఏ జట్టునుంచి ఎంతమంది ప్లేయర్లకు చాన్స్ దక్కిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే 2024 టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ కెప్టెన్‌గా హర్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా మొత్తం.. 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించగా.. మరో నలుగురు ప్లేయర్లను స్టాండ్ బై లో ఉంచారు. కాగా ఎంపికలో ఐపీఎల్ లో ఫామ్ కనబరిచిన ప్లేయర్లకు అవకాశం దక్కింది. ముఖ్యంగా సంజూ శాంసన్, దుబే, జైస్వాల్, చాహల్, రింకు సింగ్ వంటి ప్లేయర్లకు ఐపీఎల్ తో కనబరిచిన ఫామ్ ఆధారంగా చోటు దక్కినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రపంచ కప్ జట్టులోకి ఏ ఏ ఐపీఎల్ జట్ల నుంచి ఎంద మంది ప్లేయర్లకు చోటు దక్కిందో ఇక్కడ చూద్దాం..

ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), హర్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా,

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్, జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్,

ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్,

చెన్నై: రవీంద్ర జడేజా, శివమ్ దుబే,

పంజాబ్: ఆర్ష దీప్ సింగ్

కేకేఆర్: రింకు సింగ్

గుజరాత్: గిల్

Next Story

Most Viewed