ఆందోళనలో హాస్టల్‌పై నుంచి దూకిన విద్యార్థిని.. చికిత్స పొందుతూ మృతి..

by Disha Web Desk 23 |
ఆందోళనలో హాస్టల్‌పై నుంచి దూకిన విద్యార్థిని.. చికిత్స పొందుతూ మృతి..
X

దిశ,తిమ్మాపూర్ : ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లో పాస్ అవుతానో..? లేదో..? అనే ఆందోళన లో ఓ విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో చోటు చేసుకుంది. వివరాలు పోలీసుల కథనం మేరకు.. రామకృష్ణ కాలనీ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఫామ్-డి చదువుతున్న మాస శివ ప్రియకు మొదటి నుంచి పరీక్షలు అంటే భయం. కళాశాలలో శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభం అవుతుండగా ఆందోళన చెందిన శివప్రియ హాస్టల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా స్థానికులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చేరాలు తెలిపారు.

Next Story

Most Viewed